జనం న్యూస్ జూన్ 23 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని జెడ్పిఎస్ఎస్ స్కూల్ వెనకాల ఉన్నటువంటి ఎస్సి కాలనీలో గత రోజుల క్రితం మురికి కాలువల్లోని పూడికను పారిశుద్ధ్య సిబ్బంది తీసి అలాగే వదిలేశారు. నెల కావస్తున్నా అలాగే ఉన్నాయని స్థానికులు మండిపడుతున్నారు. చెత్త వర్షానికి తడిసి దుర్వాసన వస్తుందని, దోమలు పెరిగి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని కాలనీ వాసులు పేర్కొంటున్నారు. పంచాయతీ కార్యదర్శ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.