జనం న్యూస్, జూన్23, అచ్యుతాపురం:
సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో సోమవారం వేడుకలు నిర్వహించబోతోంది ఏపీ ప్రభుత్వం. ఏపీ సచివాలయం వెనుక భాగంలో ఈ వేడుకకు వేదిక సిద్ధమైంది. ఇది తొలి ఏడాది సభ మాత్రమే కాదు, ఇది ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రదర్శన, ఒక రాజకీయ మానిఫెస్టో పునః సమీక్ష.ఏడాది పాలనలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాలు, నెరవేర్చిన లక్ష్యాలు, ఇంకా జరగాల్సిన ప్రగతిపై ఈ వేదికపై చర్చిస్తారు. ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్షించబోతున్నారు. ప్రజల జీవితాల్లో పథకాల ప్రభావం, పథకాల అమలు రేటు, నిధుల వినియోగం,జిల్లా వారీగా ఫలితాలు,ఉన్నతాధికారుల పాలనా సమర్థతపై రివ్యూ చేస్తారు సీఎం చంద్రబాబు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్,రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ ధూళి రంగనాయకులు, రాష్ట్ర గవర్నర్ కార్పొరేషన్ డైరెక్టర్ భీమరశెట్టి శ్రీనివాసరావు మరియు అధికారులుతో కలిసి పాల్గొన్నారు.