(జనం న్యూస్ చంటి జూన్ 24)
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం తేదీ 17.06.2025 అర్ధరాత్రి అహ్మద్నగర్ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు బైక్ దొంగతనం చేశారు. ఫిర్యాదుదారు షేక్ బాబా ఫిర్యాదు మేరకు టి. శ్రీరామ్ ప్రేమ్దీప్ ఎస్ ఐ దౌల్తాబాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తరువాత 24.06.2025 న అర్ధరాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఇద్దరు అనుమానితులను పట్టుకున్నారు. అనుమానిత వ్యక్తులను విచారించగా, వారు అహ్మద్నగర్లో బైక్ దొంగతనం చేసినట్లు, తిమ్మకప్పల్లి గ్రామంలో బ్యాటరీ దొంగతనం చేసినట్లు అంగీకరించారు. తరువాత టి. శ్రీరామ్ ప్రేమ్దీప్ ఎస్ఐ దౌల్తాబాద్ వారిని జ్యుడీషియల్ రిమాండ్కు పంపారు.