జనంన్యూస్. 25.సిరికొండ. ప్రతినిధి.
నిజామాబాదు రూరల్ నియోజకవర్గం సిరికొండ మండల కేంద్రం లోని సిరికొండ ఎస్సై ఎల్ రాము ఆధ్వర్యంలో పెద్ద వాల్గోట్ గ్రామంలో మత్తు పదార్థములు మరియు గంజాయి లాంటి మాదకద్రవ్యాలు వాడటo వల్ల కలిగే ఇబ్బందులు మరియు వాటికి యువత బానిస అయితే వారి యొక్క కెరీర్ ఎలా నాశనం అవుతుందో తెలియజేశారు .ఎవరైనా గంజాయి తీసుకొని పోలీసులకు పట్టుబడిన ,ఎలాంటి క్రిమినల్ కేసులలో ఇన్వాల్వ్ అయిన వారికి పాస్పోర్ట్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరని తెలియజేశారు. కాబట్టి యువత చేజేతులా వారి యొక్క బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. ఎస్సై సమక్షంలో మత్తు పదార్థములు వాడితే జైలు శిక్ష తప్పదని నినాదాలు చేస్తూ ఊరంత ర్యాలీ నిర్వహించారు.ఇట్టి కార్యక్రమం లో దాదాపుగా 50 మంది ప్రజలు పాల్గొన్నారు.