సైబర్ క్రైమ్ పై పోరాటంలో తుంగూర్ యువకుడు..
అభినందించిన ఎస్.ఐ కుమారస్వామి.
జగిత్యాల, జూలై 6:
జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలం లో తుంగూరు గ్రామానికి చెందిన సామాన్య యువకుడు కందుకూరి స్వామి సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ జగిత్యాల జిల్లాలో సైబర్ వారియర్ అనే వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి సైబర్ క్రైమ్ వలన మోసపోయిన వారికి సలహాలను ఇస్తూ ఇంకా ఎవరు మోసపోకుండా నష్టపోకుండా అవగాహన కల్పిస్తూ సామాజిక సేవలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా డిజిటల్ యుగంలో వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు, "సైబర్ క్రైమ్ అవగాహన పోస్టర్"ను బీర్పూర్ ఎస్.ఐ కుమార స్వామి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ కుమార స్వామి గారు మాట్లాడుతూ, "ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ను వాడుతున్నారు. అయితే, వాడకంతో పాటు జాగ్రత్తలు కూడా అవసరం. ప్రతి ఒక్కరూ సైబర్ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి,OTP లు,బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్వర్డ్లు ఇతరులతో పంచుకోవద్దు.ఫోన్ కాల్స్, ఫిషింగ్, మెసేజ్లు,సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయరాదు,లాటరీ మోసాల నుండి అప్రమత్తంగా ఉండాలని" హెచ్చరించారు. జగిత్యాల సైబర్ వారియర్స్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కందుకూరి స్వామి మాట్లాడుతూ, "సైబర్ భద్రత ఇప్పుడు అన్ని వయస్సుల వారికి అవసరమైంది.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా చాలామందికి ఈ మోసాలపై అవగాహన లేదు.అందుకే ఈ పోస్టర్ రూపకల్పన చేసి,
"సైబర్ వారియర్స్ వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రజలకు అవగాహన అందించడమే మా లక్ష్యం.ప్రతి నెలా సైబర్ అవగాహన కార్యక్రమాలు,ఆన్లైన్(zoom) సెషన్లు ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం మా ప్రణాళిక" అని తెలిపారు. ఈ పోస్టర్లో ప్రధానంగా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, మోసపోతే ఏ నంబర్కు ఫిర్యాదు చేయాలి (1930), మరియు ప్రజలు తక్షణం ఎలా స్పందించాలి అన్న విషయాలు స్పష్టంగా చెప్పబడ్డాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ కుమారస్వామి, హెడ్ కానిస్టేబుల్ శంకరయ్య, కానిస్టేబుల్ సత్యనారాయణ, సంద్య జగిత్యాల సైబర్ వారియర్స్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కందుకూరి స్వామి,హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ ఆడెపు వెంకటేష్,కందుకూరి మహేష్, కందుకూరి (పెద్ద)స్వామి తదితరులు పాల్గొన్నారు.