జనం న్యూస్ జూలై 09(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
యువత గంజాయి, డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు తమ దృష్టికి వస్తే పోలీస్ శాఖ పరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని,ఎవరైనా గంజాయిని తాగినా, విక్రయించినా వారిపై కఠినచర్యలు తీసుకుంటామని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.మంగళవారం ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ..గంజాయిని తాగి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, గంజాయి వంటి మాదకద్రవ్యాల బారిన పడితే నేరాలు చేస్తారని వాటి నియంత్రణకు పోలీసులకు సహకరించాలన్నారు. గంజాయి మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు.పాశ్చాత్య దేశాల సంస్కృతి మన దేశంలో విచ్చలవిడిగా సాంకేతిక రంగం ద్వారా వారి దురాలవాట్లను మనకు రుద్దే ప్రయ త్నం చేస్తున్నారని మంచిని తీసుకుని చెడును వదిలేయాలని సూచించారు. యువత చదువు, క్రీడలు తప్పా ఇంకో ఆలోచన దరికి చేర నీయొద్దన్నారు.పాశ్చాత్య దేశాల సంస్కృతి మన దేశంలో విచ్చలవిడిగా సాంకేతిక రంగం ద్వారా వారి దురాలవాట్లను మనకు రుద్దే ప్రయ త్నం చేస్తున్నారని మంచిని తీసుకుని చెడును వదిలేయాలని సూచించారు. యువత చదువు, క్రీడలు తప్పా ఇంకో ఆలోచన దరికి చేర నీయొద్దన్నారు.యువత గంజాయి మత్తులో జీవితాలు నాశనం చేసుకుని కుటుంబాలకు శోకం మిగిల్చవద్దని సూచించారు.