జనం న్యూస్ జులై 08 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
ప్రతీ నిరుపేద కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి ఆదుకుంటుందని ఆర్టీఏ మెంబర్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లావుడ్య రమేష్ అన్నారు.మండల కేంద్రానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయి.ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసారు.లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ దశల వారీగా అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామనారు.కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గం దేవాజీ,ఇందిరమ్మ కమిటీ సభ్యులు దుర్గం అన్నాజీ,అజ్మీర అశోక్, మైనార్టీ మండల అధ్యక్షుడు ఇమ్రోజ్ అలి,యువనేత సోనాలే సంతోష్ బాబు, పంచాయతీ సెక్రటరీ రవీందర్,గ్రామ ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు