ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు కాసిపేట రవి
(జనం న్యూస్15జూలై భీమారం మండలప్రతినిధి కాసిపేట రవి )
తరతరాలుగా అన్ని రంగాలలో అన్యాయానికి గురవుతున్నబడుగు బలహీన వర్గాల గురించి గొంతేత్తుతున్న తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడి చేసి మల్లన్నను హత్య చేయడం ద్వారా భవిష్యత్తులో మాట్లాడే వాళ్లు ఎవరైనా ఇదే గతే మీకు పడుతుందనే హెచ్చరిక చేయడానికి చేసిన కుట్రనే నిన్న క్యూ న్యూస్ పై జరిగిన కుట్ర దుర్మార్గం. కాబట్టి సమాజం పరిస్థితిని అర్థం చేసుకొని బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అధికారంలో భాగస్వాములను చేయటానికి కలిసి రావాలని బడుగు బలహీన వర్గాల పట్ల జరుగుతున్న దుర్మార్గాలను ఐక్యంగా ఎదుర్కోవటానికి సిద్ధం కావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఒకవేళ మల్లన్న ఏదన్న తప్పు మాట్లాడి ఉంటే దానికి సమాధానంగా చెప్పడానికి మీడియా ఉంది .పోలీసులు ఉన్నారు. న్యాయస్థానాలు ఉన్నాయి . ఇవన్నీ వదిలేసి రాజ్యాంగాన్ని గంగలో కలిపి తమ ఆధిపత్యానికి ప్రమాదంగా బడుగు బలహీన వర్గాలు తయారవుతున్నారన్న బాధతో దుర్మార్గంగా క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడి చేసి హత్యా ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్యంలో అత్యంత దుర్మార్గం . దీనిని సభ్య సమాజం ఖండించవలసిందిగా భీమారం మండల ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు కాసిపేట రవి కోరారు,