జుక్కల్ జులై 16 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలంలోని నాగుల్గావ్ గ్రామంలో క్షేత్రస్థాయిలో సాగు అవుతున్న సోయాబీన్,కంది పంటలను వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్ చిద్రవార్ పరిశీలించి రైతులకు తగు సలహాలు,సూచనలు ఇవ్వడం జరిగింది. సోయాబీన్ పంట ప్రస్తుతం 25 నుండి 30 రోజుల దశలో ఉంది. ఇందులో ముఖ్యంగా పచ్చ పురుగు, రసం పీల్చే పురుగు, కాండపు ఈగ గమనించి వీటి నివారణకు ప్రొఫెనోఫోస్ 50EC ఎకరాకు 400ml + వేప నూనె 1500ppm @500ml ఎకరాకు +19.19.19@ 1kg ఎకరాకు కలిపి పిచికారీ చేయాలని రైతు సోదరులకు సూచించడం జరిగింది. కాండపు ఈగ ఉదృతి అధికంగా ఉంటే Profenophos 50EC@400ml ఎకరాకు మరియు Lamdacyalothrin 200ml ఎకరాకు కలిపి పిచికారీ చేయాలని సూచించడం జరిగింది. రైతు సోదరులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి పురుగు మందులు పిచికారి చేయాలని తెలపడం జరిగింది. ఈ క్షేత్రస్థాయి సందర్శనలో రైతు సోదరులు రాగోబ శ్రీనివాస్, దొండిబ తదితరులు పాల్గొనడం జరిగింది.సోయాబీన్ కంది పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారి…