విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.,
జనం న్యూస్ 01 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
నేరాలను నియంత్రించి, ప్రజల భద్రత, రక్షణ కల్పించుటలో భాగంగా ఎస్.కోట పోలీసు స్టేషను పరిధిలోని దారపర్తి, బొడ్డవర పంచాయతీల్లోని గిరిజన గ్రామాల్లో 'కార్టన్ అండ్ సెర్చ్' ఆపరేషను జూలై 31న నిర్వహించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎటువంటి నాటు సారా, గంజాయి లభించలేదన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ - నేరాలను నియంత్రించుటే లక్ష్యంగా ఎస్.కోట పోలీసు స్టేషను పరిధిలోని దారపర్తి పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాలైన మునుపురాయి, రాయపాలెం, చప్పనిగెడ్డ, పల్లపు దుంగాడ, రంగవలస, పాతశెనగపాడు, కొత్త సెనగపాడు, దబ్బగుంట గ్రామాల్లోను మూల బొడ్డవర పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం, బొడ్డపాడు, చిలకపాడు, చిట్టెంపాడు, గుణపాడు గ్రామాల్లో విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడిన పోలీసులు 'కార్డన్ అండ్ సెర్చ్' ఆపరేషను నిర్వహించారన్నారు.
ఈ బృందాలకు ఎస్.కోట సిఐ వి.నారాయణ మూర్తి, కొత్తవలస సిఐ షణ్ముఖరావు, విజయనగరం రూరల్ సిఐ బి.లక్ష్మణరావు నాయకత్వం వహించారన్నారు. ఈ 'కార్డన్ అండ్ సెర్చ్' ఆపరేషనుకు ముందు ఆపరేషను యొక్క ముఖ్య ఉద్ధేశ్యాన్ని, ఆపరేషనులో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బంది నిర్వర్తించాల్సిన విధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆయా గ్రామాల్లోని ప్రజలతో వ్యవహరించాల్సిన తీరును గురించి ముందుగా డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు వివరించి, దిశా నిర్ధేశం చేసారన్నారు. ఈ ఆపరేషనులో 16మంది ఎస్ఐలు, 85 మంది పోలీసు సిబ్బంది బృందాలుగా ఏర్పడి, వారికి నిర్దేశించిన గిరిజన గ్రామానికి చేరుకొని, ఇండ్లు, బహిరంగ ప్రదేశాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారన్నారు. అనుమానిత వ్యక్తులు పారిపోయేందుకు అవకాశం ఉన్న మార్గాలను ముందుగా గుర్తించి, ఆయా మార్గాలను పోలీసు బృందాలతో ముందుగానే
దిగ్భందనం చేసామన్నారు. గ్రామాల్లో మకాం వేసిన అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా ఏర్పాటు చేసామన్నారు. అనంతరం, గ్రామస్ధులతో సమావేశమై అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ వద్దని, గంజాయి అక్రమ రవాణ, విక్రయాలు, వినియోగంకు దూరంగా ఉండాలన్నారు. లైసెన్సులు లేకుండా ఆయుధాలు కలిగి ఉండడం చట్టరీత్యా నేరమని, ఎవరి వద్దనైనా అనుమతులు లేకుండా ఆయుధాలు లభిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ “కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషన్ లో విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, ఎస్.కోట సిఐ వి.నారాయణమూర్తి, విజయనగరం రూరల్ సిఐ బి.లక్ష్మణరావు, కొత్తవలస సిఐ షణ్ముఖరావు, 16మంది ఎస్ ఐలు, 85మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.