జనం న్యూస్ 02 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం కలెక్టరేట్ లో తల్లి పాల వారోత్సవాల పోస్టర్ను కలెక్టర్ అంబేడ్కర్ శుక్రవారం ఆవిష్కరించారు.
ఆట అ స్ ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తల్లి పాల ప్రాముఖ్యతపై ఐసీడీఎస్, వైద్య సిబ్బంది సంయుక్తంగా అవగాహన కల్పించాలన్నారు. బిడ్డకు తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవన్నారు. గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్జేడీ చిన్మయిదేవి, సిబ్బంది పాల్గొన్నారు.