. జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా జోగిపేట్ 10/8/2025
బి ఆర్ఎస్ యువ నాయకుడు జిన్నా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జోగిపేట్ మూడో వార్డులో గల మల్లన్న కాలనీలోని మహిళా సోదరీమణులకు స్వీట్ బాక్స్ అందచేయడమైనది. రక్షాబంధన్ సందర్భంగా జిన్నా విజయ్ కుమార్ మాట్లాడుతూ శ్రావణ మాస శుక్లపక్షంలో వచ్చే పర్వదినాన్ని శ్రావణ పూర్ణిమ, రాఖీ పూర్ణిమ మరియు జంధ్యాల పూర్ణిమ గా భారతదేశమంతా జరుపుకునే కులమత బేధాలు లేకుండా ఒక వసుదైక పండుగని, చాటే ఒక అర్థం ఈ రాఖీ పండుగలో ఇమిడి ఉన్నదని, అన్న దమ్ములు లేని వారు కూడా తమ సొంత వారిగా భావించే వారికి కూడా రాఖీ కట్టి ఈ పండుగను జరుపుకుంటారని, అన్నా, చెల్లెలు మరియు అక్క, తమ్ముళ్ల అనుబంధానికి రాఖీ పండుగ ఒక ప్రత్యేక. అమ్మానాన్నల తర్వాత ప్రేమను పంచే సోదరులుగా అన్నింట విజయం కలగాలని ఆకాంక్షిస్తూ కట్టే రాఖీ లో ప్రేమాను రాగాలు ఇమిడి ఉన్నాయని, ఆ క్షణం చెల్లిపోయేది కాదని జీవితంలో నిలిచి పోయేదని, అన్నయ్య కలలు పండాలన్న చెల్లెమ్మ మనసు నిండాలన్న రాఖీ పౌర్ణమి కే సాధ్యమని తెలిపారు.