
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 19 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆదేశాలు మేరకు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ (దిశ ) పర్యవేక్షణలో ఈ రోజు పల్నాడు జిల్లా వినుకొండ మండలం ఏనుగుపాలెం గ్రామం జడ్పీహెచ్ హై స్కూల్ నందు చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ విద్యార్థులకు ఇంటెన్సీఫైడ్ ఐ ఈ సి క్యాంపెయిన్ 2025 ద్వార ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమములో వినుకొండ ఐసిడిఎస్ ప్రాజెక్టు సూపర్వైజర్ శ్రీదేవి మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ అనేది అంటువ్యాధి కాదని అలాంటి వారిని ప్రేమతో ఆదరించాలని వారిపై చిన్నచూపు వివక్షత చూపరాధని వివరించారు తరువాత జోనల్ సూపర్వైజర్ బి నాగేశ్వరరావు మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ అంటే ఏమిటి ఎన్ని విధాలుగా వస్తుంది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి మరియు యాంటీ రిట్రో వైరల్ తెరఫీ మందులు గురించి వివరించారు అదేవిధంగా విద్యార్థులు చదువుతోపాటు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం బి శైలజ ఏఎన్ఎం టి ఊర్మిళా కుమారి అంగన్వాడి టీచర్ పి కస్తూరి ఆశా వర్కర్ బాల కుమారి మరియు క్లస్టర్ లింక్ వర్కర్ జి శైలజ మరియు విద్యార్థుల్లో పాల్గొన్నారు