
వారికే అంకితం డాక్టరేట్ పొందిన సుర్నార్ బాలాజీ
జుక్కల్ ఆగస్టు 20 జనం న్యూస్
ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతిష్టాత్మక చేపట్టినటువంటి 84 వ స్నాతకొత్సవం లో ఇస్రో చైర్మన్ డాక్టర్. వి.నారాయణ గారి చేత పీహెచ్డీ డాక్టరేట్ పట్టా అందుకున్న సుర్నార్ బాలాజీ పాటిల్ తండ్రి అంగత్ రావు రావు పాటిల్. "సమకాలిన ఉపన్యాసాలలో మానవీయ విలువలు " అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ అప్సర్ ఉన్నిసా బేగం పర్యవేక్షణలో హిందీ విభాగంలో దాదాపు 5 సంవత్సరాలు పరిశోధనలు పూర్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బాలాజీ మాట్లాడుతూ. చదువుకోవాలని సంకల్పం ఉన్న ప్రతి విద్యార్థి కష్టాలను ఇష్టంగా మార్చుకొని ముందుకెళ్తాడని నేను చిన్నప్పటినుంచి ఎంతో కష్టపడి చదివి ఈ డాక్టరేట్ పట్టాను తీసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ నా పీహెచ్డీ పట్టాను నన్ను కష్టపడి స్థాయికి తీసుకొచ్చిన మా తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నానని అన్నారు. ఈ స్థాయి వచ్చే వరకు నా వెన్నం నుండి నన్ను ప్రోత్సహించిన, తల్లి రుక్మిణి బాయ్ , సోదరుడు మారుతి ,నా జీవిత భాగస్వామి (యశోద),మరియు నా పిల్లలకు, నా చిన్ననాటి నుండి ఇప్పటి వరకు నా స్నేహితులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.