
జనం న్యూస్ ఆగస్టు 20 ముమ్మిడివరం ప్రతినిధి
అయినవిల్లి బీజేపీ మండల అధ్యక్షులు వెంకట రమణ అయినవిల్లి మండలం బీజేపీ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సారధ్యం యాత్ర కార్యక్రమం మండల ఇంచార్జి మోకా ఆదిలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 25 వ తేదీన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారు సారధ్యం యాత్ర ద్వారా జిల్లా లో శోభాయాత్ర అమలాపురం లో నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. ఈ సమావేశానికి మండలం నుంచి అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు కుడుపూడి చంద్రశేఖర్, ఓబీసీ రాష్ట్ర నాయకులు కొప్పనాతి శ్రీరామచంద్రమూర్తి, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు మిద్దె నూతన రవిరాజ్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు వేటుకూరి శ్రీనివాసరాజు పాల్గొన్నారు.