
జనం న్యూస్ ఆగష్టు 20 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
వాంకిడి మండలం కిరిడీ గ్రామానికి చెందిన గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్లకు సమాచారం అందించారు. గర్భిణిని వాంకిడి మండల కేంద్రంలోని పిహెచ్సికి ప్రవహిస్తుండగా మార్గమధ్యంలో తేజపూర్ సమీపంలోని గర్భిణీకి పురిటినొప్పులు ఎక్కువ కావడంతో 108 ఈఏంటి సంతోష్ డెలివరీ చేశారు. ఆడ పిల్లలకు జన్మనిచ్చిన వసంతకు ఇది మూడో కాన్పు. తల్లి బిడ్డలను మండల ఆసుపత్రిని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంది. అంబులెన్స్ లో డెలివరీ చేయడంతో కుటుంబ సభ్యులు ఈఎంటి సంతోష్, పైలట్ భీమ్రావును అభినందించారు.