ఆరవ రోజున అన్నపూర్ణేశ్వరుడిగా దర్శనమిస్తున్న గణనాథుడు
(జనం న్యూస్ 1 సెప్టెంబర్ ప్రతినిధి,కాసిపేట రవి)
భీమారం మండలం నర్సింగాపూర్ గ్రామం పంచాయతీలో వినాయక చవితి నవరాత్రుల గణనాధుని అలంకరణ,మొదటి రోజున హరిద్ర వర్ణం, రెండవ రోజున కుంకుమ వర్ణంలో,మూడవ రోజున పిత వర్ణం,నాలుగవ రోజున కృష్ణ వర్ణంలో,ఐదవ రోజు రుద్రక్షేశ్వరుడు, గా ఆరవ రోజు అన్నపూర్ణేశ్వరుడిగా, స్వామివారు దర్శనమిస్తు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు, ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రమీల అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నర్సింగపూర్ గణేష్ మండలి సభ్యులు పాల్గొన్నారు