జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 4 రిపోర్టర్ సలికినీడి నాగు
సెల్ 9550978955
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆదేశాలు మేరకు, పల్నాడు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ (దిశ ) పర్యవేక్షణలో ఈ రోజు (4/9/25) పల్నాడు జిల్లా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి గ్రామం బాలాజీ ఐ టి ఐ కళాశాల నందు చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ ప్రాజక్ట్ ఇంటెన్సీఫైడ్ ఐ ఈ సి క్యాంపెయిన్ 2025 ద్వార విద్యార్దులకు ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో వినుకొండ ఐ సి టి సి కౌన్సలర్ కె సురేష్ మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్ఐవి ఎయిడ్స్ అంటే ఏమిటి ఎన్ని విధాలుగా వస్తుంది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి మరియు ఎ బి సి సూత్రం గురించి వివరించారు అనంతరం కరపత్రాలు మరియు పోస్టర్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కర్రి వెంకట్ గ్రామ సర్పంచ్ పెనుమాల సుమలత వైస్ ప్రెసిడెంట్ పెద్దిరెడ్డి రామిరెడ్డి సి హెచ్ ఓ బి కుమారి, ఎ యన్ యం వి విజయమ్మ అంగన్వాడీ కార్యకర్తలు ఎ ఆదిలక్షమి ఎ ప్రభావతి వై రాజ్య లక్షమి ఆశ కార్య కర్తలు కోటేశ్వరమ్మ లీలమ్మ లింక్ వర్కర్ పి శైలజ పాల్గొని నిర్వహించారు