జనం న్యూస్ 13 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి
జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైనందున… నైతిక బాధ్యత వహిస్తూ టీజీపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలి. బి ఆర్ యస్ వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య గద్వాల జిల్లా కేంద్రం లోని గ్రంధాలయం లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరుద్యోగులతో కలిసి గతంలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష ను రద్దు చేయాలని ఆందోళన చేసి నిరసన చేయడం జరిగింది.ఈ సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ… సంవత్సరం నాటికీ భర్తీ చేస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు ఏమైనవి..జాబ్ క్యాలెండర్ ఎక్కడ..మెగా డిఎస్సి ఎప్పుడు వేస్తావు..కాంగ్రెస్ ప్రభుత్వ నిరుద్యోగ యువతకు శాతంగా మారిందని అన్నారు హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు గ్రూప్ వన్ 1 పరీక్ష నిర్వహించిన అనేక సెంటర్లో అక్రమాలు జరిగినట్టు నిరుద్యోగులు ఆరోపిస్తున్న నేపథ్యంలో వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాముదీనికి నైతిక బాధ్యత వహిస్తూ టీజీపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం..అందరి అభ్యర్థులకు 28 కేంద్రాల్లో సెంటర్లు కేటాయించగా… కోటి ఉమెన్స్ కాలేజీలో మహిళ అభ్యర్థులకి ప్రతేకంగా రెండు సెంటర్లలో 71 మంది ఎంపికయ్యారు… మిగిలిన 26 సెంటర్లో 139 మంది ఎంపికయ్యారు ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు 563 ఉద్యోగాలలో కేవలం 9 శాతం మంది మాత్రమే తెలుగు మీడియం విద్యార్థులు ఉన్నట్లు టీజీపీఎస్సీ సీల్డ్ కవర్లో పేర్కొందని తెలిపారు ఇంగ్లీష్ లో 12,381 మంది పరీక్ష రాస్తే 508 మంది ఎంపికయ్యారు,తెలుగు లో 8,694 మంది పరీక్ష రాస్తే కేవలం 56 మంది మాత్రమే ఎంపికయ్యారు…! దీనివల్ల తెలుగు మీడియం చదివిన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు అభ్యర్థులు రీ కౌంటింగ్ అప్లికేషన్ చేసుకుంటే వాళ్లకు మార్కులు తగ్గాయని అన్నారు నిరుద్యోగుల జీవితాలతో పబ్లిక్ కమిషన్ చెలగాటం ఆడుతోందని ఆరోపించారు 2 హాల్టికెట్స్ గతంలో 2011 ఇచ్చినం అని హైకోర్ట్ కి తెలిపిన కమిషన్… ఆ రోజు సమైక్య రాష్ట్రంలో నాటి కమిషన్ చైర్మెన్ వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు అన్యాయం జరిగింది అని నాడు పోరాడినం ,ఇప్పుడున్న కమిషన్ అదే విధానాన్ని అనుసరించటం వల్ల గ్రూప్ 1 అభ్యర్థులకు అన్యాయం జరిగింది… నేడు పోరాడుతున్నాం అని వివరించారు
ఇప్పటికైనా ప్రభుత్వం పట్టింపులకు పోకుండా హైకోర్ట్ డివిజన్ బెంచికి మరియు సుప్రీంకోర్టు కి వెళ్లవద్దని అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. నిరుద్యోగులకు జిల్లా బార్ అసోసియేషన్ వారు అడ్వకేట్ ఇస్మాయిల్ మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో మహేష్, మాధవ్, కిరణ్, రంగస్వామి, నర్సింహులు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.