
బహుజనుల కోసం బంధుకులు పట్టిసమానత్వం కోసం పోరాడిన వీరనారి
ఆ మహనీయుల స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం : నీలం మధు ముదిరాజ్
చిట్కుల్ లో ఘనంగా ఐలమ్మ జయంతి వేడుకలు
జనం న్యూస్ సెప్టెంబర్ 26 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు; పెత్తందారుల చేతిలో అణిచివేయబడ్డ వర్గాలకు తిరుగుబాటు తత్వాన్ని నేర్పించి ప్రతిఘటించే పోరాటానికి స్ఫూర్తిగా నిలిచిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.
శుక్రవారం చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని చిట్కుల్ లోని ఐలమ్మ కాంస్య విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర మొత్తం త్యాగదనుల అమరత్వమేనని ఆ మహనీయుల ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణలో ప్రశ్నించే తత్వం అలవడిందన్నారు. నిజాం నిరంకుశ పాలనలో శిథిలమైపోయిన బతుకులను బాగు చేయడానికి వెట్టి చాకిరికి వ్యతిరేకంగా దొరలు జమీందారుల చేతుల్లో బానిసలుగా మగ్గుతున్న బహుజనులకు స్ఫూర్తినిస్తూ నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు. ఆనాడు బహుజనుల కోసం పోరాటం చేసిన ఆ మహనీయుల స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు పంచాలనే సంకల్పంతో వీరనారి సబ్బండ వర్గాల ప్రతినిధి చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని చిట్కుల్లో ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఆ మహనీయుల త్యాగఫలంతో వారు ఇచ్చిన స్ఫూర్తితో సిద్ధించిన తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మహనీయుల ఆశయాల కనుగుణంగా పరిపాలన కొనసాగిస్తుందన్నారు. ఆ మహనీయుల స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించాలని సంకల్పంతో హైదరాబాద్ లోని మహిళా యూనివర్సిటీ కి చాకలి ఐలమ్మ పేరుని పెట్టి ఆ వీరనారికి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిందన్నారు. రేవంతన్న స్ఫూర్తితో సబ్బండ, బడుగు బలహీన వర్గాల హక్కులకే పోరాడుతూ వారి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, మాజీ pacs చైర్మన్ నారాయణ రెడ్డి, మహేష్, సత్తయ్య, నర్సింలు, అర్జున్, గోపాల్, కిషోర్, చంద్రశేఖర్, రజక సోదరులు తదితరులు పాల్గొన్నారు..