
పెట్రోల్ బంకు ప్రారంభోత్సవంలో ఎంపీ సురేష్ షేట్కర్. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి. హనుమంతరావు
పాపన్నపేట. సెప్టెంబర్. 26 (జనంన్యూస్)
పాపన్నపేట మండలం వ్యాపార రంగంలో ముందుండాలని, వ్యాపార0లో పోటీ ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని జహీరాబాద్ ఎంపీ సురేష్ షేట్కర్. మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు.., మండల కేంద్రమైన పాపన్నపేటలో గణేష్ హెచ్ పి పెట్రోల్ బంక్ ను వారి చేతుల మీదుగా ప్రారంభించారు… కార్యాలయం ప్రారంభించిన అనంతరం వాహనాలలో డీజిల్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాపన్నపేట ఇప్పుడిప్పుడే అన్ని రంగాలలో ముందుకు వెళుతుందన్నారు.. ప్రతి ఒక్కరు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా పాపన్నపేటను వ్యాపారంగంలో అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షించారు.. ఈ కార్యక్రమంలో పెట్రోల్ బంక్ యజమాన్యం. రాజశేఖర్. మహేందర్. నాయకులు కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి.. ప్రశాంత్ రెడ్డి. శ్రీకాంత్. గోవిందు నాయక్.. నిట్టలాక్షప్ప. బాపిరెడ్డి. ఆకుల శ్రీనివాస్. గౌస్. బి కొండ రాములు. రమేష్ గౌడ్. నాగరాజ్. బాబర్.. చోటు. షాహిద్ పాషా. ఈశ్వరప్ప. వివిధ గ్రామాల ముఖ్య నాయకులు. తదితరులు పాల్గొన్నారు…
