
మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అశోక్ బాబు.
ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్దమనిమాల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు టి అశోక్ బాబు అన్నారు. సోమవారం నందలూరుకు చేరుకున్న రాజ్యాంగ పరిరక్షణ యాత్రకు దళిత నాయకులు స్వాగతం పలికారు. అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో అశోక్ బాబును ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలు అన్ని విధాలుగా నష్టపోతారన్నారు. కొందరి మాయమాటల మోజులో పడి కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ చేయడం అన్యాయం అన్నారు. దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించేందు కోసమే ఈ యాత్ర చేపట్టామన్నారు. మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగం సంజీవ్ మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ యాత్రకు అనూహ్య స్పందన లభిస్తుంది అన్నారు ఈ కార్య క్రమంలో నందలూరు సర్పంచ్ మోడపోతుల రాము. ఆర్ముగం విశ్వనాధ్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యులు పెనుబాల నాగ సుబ్బయ్య కాకి చంద్ర నాయనపల్లి ఆదినారాయణ తుమ్మది శివకుమార్ గుడిష సుబ్రహ్మణ్యం ఎముక దుర్గయ్య శివ నరసింహులు సురేష్ నాగభూషణం.నాగరాజు. డిస్కో మని తదితరులు పాల్గొన్నారు.