జనం న్యూస్ 14 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
డెంకాడ మండలం పెద్ద తాడివాడ గ్రామంలో క్షుద్ర పూజలు జరిగాయని స్థానికులు తెలిపారు. గ్రామానికి చెందిన పైడియ్య ఇంటి గుమ్మం దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం మనిషి పుర్రెను పెట్టి పూజలు జరగడంతో గ్రామస్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రస్తుత కాలంలో కూడా మూఢనమ్మకాలతో కొన్ని గ్రామాల్లో ఇలాంటి పూజలు జరగడం చర్చ నీయాసంగా మారింది. ఎవరు ఈ క్షుద్ర పూజలు చేశారు అనే విషయంపై డెంకాడ పోలీసులు ఆరాతీస్తున్నారు.