జనం న్యూస్, అక్టోబర్ 15, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి
: పట్టణంలో ఈ రోజు సిపిఆర్ వారోత్సవాల్లో భాగంగా ఎంపీడీఓ సమావేశ మందిరంలో సిపిఆర్ పై వివరిస్తున్న మండల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ ఎల్లాల అంజిత్ రెడ్డి, డాక్టర్ తాటిపర్తి శివాని, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు గుండె జబ్బుల ద్వారానే అవుతున్నాయని, ప్రతి ఒక్కరూ సిపిఆర్ కార్డియో పల్మనరీ రీసెర్సిటేషన్ పై అవగాహన పెంచుకొని అత్యవసర సమయంలో మన తోటి వారికి కార్డియా కరెస్టు నుండి సిపిఆర్ చేసి, అంబులెన్స్ ద్వారా దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాణాలు నిలబెట్టొచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు. కావున ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని పోషకాహారం తీసుకుంటూ ఉప్పును తగ్గించాలని, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని, జీవనశైలి మార్పుల ద్వారానే జీవన శైలి వ్యాధులను అరికట్టవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వర్ రెడ్డి ఎంపీడీవో, గ్రామపంచాయతీ సెక్రటరీలు, హెల్త్ సూపర్వైజర్ అచ్యుతరావు, జగన్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.