
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ అక్టోబర్ 29
జహీరాబాద్ నియోజకవర్గం ఎల్లమ్మ తల్లి ఆలయం ముఖద్వారం నిర్మాణానికి భూమిపూజ ఘనంగా
జహీరాబాద్ నియోజకవర్గంలోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో కొత్త ముఖద్వారం నిర్మాణానికి ఈరోజు భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.గ్రామస్తులు ఆలయం అభివృద్ధి కోసం ముందుకు వచ్చి స్వచ్ఛందంగా విరాళాలు అందించారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ – “ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామానికి శాంతి, సౌభాగ్యం కలగాలని కోరుకుంటున్నాం. ఈ ముఖద్వారం నిర్మాణం ద్వారా ఆలయానికి మరింత గౌరవం పెరుగుతుంది” అన్నారు.యువత కూడా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని భక్తి భావంతో పూజలు నిర్వహించారు. గ్రామం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోయింది.