
జనంన్యూస్. 30.నిజామాబాదు.
నిజామాబాదు జిల్లాలో స్కూల్ బస్సులను మరియు ప్రైవేట్ బస్సులను తనిఖీలు నిర్వహన.పోలీస్ కమిషనర్ వెల్లడి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐపీఎస్., ఆదేశాల మేరకు పోలీస్ శాఖ మరియు మోటార్ వాహనాల శాఖ ఆధ్వర్యంలో స్కూల్ బస్సులు మరియు ప్రైవేట్ బస్సులను తనిఖీ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సంబంధిత అధికారులు వాహనాల పత్రాలు డ్రైవింగ్ లైసెన్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్లు
ఇన్స్యూరెన్స్ వివరాలను పరిశీలించారు.విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ తనిఖీలు చేపట్టారని అధికారులు తెలిపారు. నియమాలను ఉల్లంఘించిన వాహనాలపై కేసులు నమోదు చేసి , డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేశారు.