
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట నవంబర్ 3 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు డైలీ డ్రాప్ ఔట్ డ్రైవ్ లో భాగంగా చిలకలూరిపేట పట్టణంలోని 34 వార్డు పోలిరెడ్డి పాలెం ఆవాస ప్రాంతమైన పెద కోండ్రుపాడు నందు రహదారి పక్కన ఇళ్లలో ఉన్న విద్యార్థులను ఇంటింటి కి వెళ్లి విద్యార్థినీ విద్యార్థులను ప్రతిరోజు పాఠశాలకు పంపించాలని కోరడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలు అందించే సౌకర్యాలు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగింది. బడి ఈడు వయసులో విద్యార్థులు బడిలోనే ఉండాలని పనులకు పంపించడం చట్టరీత్యా నేరం అవుతుందని కావున విద్యార్థులను తప్పకుండా బడికి పంపించాలని కోరడం జరిగింది, విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులు తొలగాలనిప్రతి విద్యార్థికి తల్లికి వందనం కింద 15వేల రూపాయలు ఆర్థిక సహాయం ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ షూస్ బెల్ట్ సాక్స్ బ్యాగ్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం లో విద్యాబోధన చేయడం జరుగుతుంది. సుశిక్షితులయిన, అత్యున్నత శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే విద్యాబోధన జరపడం జరుగుతుంది. విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఐదు రోజులు కోడిగుడ్డు మూడు రోజులు చిక్కి మూడు రోజులు రాగి జావా ప్రతిరోజు ప్రత్యేక మెనుతో అత్యంత పోషక విలువలు కలిగిన భోజనం అందించడం జరుగుతుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ట్రావెలింగ్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కావున విద్యార్థుల విద్యార్థులను పాఠశాలకు ప్రతి రోజూ పంపిం చాలని కోరడం జరిగింది ప్రభుత్వ పాఠశాలను పరిరక్షించుకోవడంలో భాగంగా తల్లిదండ్రులు సామాజిక వేత్తలు సహకరించాలని కోరడం జరిగింది మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పోలిరెడ్డి పాలెం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జె హైమావతి, ఉపాధ్యాయులు పోటు శ్రీనివాసరావు, పేరెంట్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు