
అందె రోడ్ల సమస్యల గురించి గజ్వెల్ జోన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ని కలిసిన జేఏసీ నాయకులు.
జనం న్యూస్, నవంబర్ 4, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ )
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల అందే గ్రామానికి చెందిన జేఏసీ నాయకులు వివిధ పార్టీలకు చెందిన అఖిలపక్షం నాయకులు అందరూ కలిసి మారుమూల ప్రాంతం అయిన అందే గ్రామానికి రోడ్లు వేయాలని గజ్వేల్ జోన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాయుడు ను కలిసి వినతి పత్రం అందజేశారు. మారుమూల ప్రాంతం గ్రామమైన అందే గ్రామానికి గత ఇరువై సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వేసిన రోడ్లు తప్ప, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు వేయకపోవడం, పాత రోడ్లన్నీ పూర్తి గుంతల మయం అవ్వడంతో, గ్రామం నుండి ప్రతిరోజు సిద్దిపేట జిల్లా కేంద్రానికి ఉన్నత చదువుల కోసం కళాశాలకు వెళుతుంటే, సరైన సమయానికి బస్సులు రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు, గ్రామంలోని గర్భిణులు బాలింతలు వృద్ధులు హాస్పిటల్ లోకి వెళ్దామంటే, అంబులెన్స్లు రోడ్డు బాగాలేక రాకపోవడంతో, వైద్యానికి నోచుకోలేకపోతున్నారు. గ్రామంలో రైతులు ఆకుకూరలు కూరగాయలు, అత్యధికంగా పండించినప్పటికీ రోడ్డు రవాణా వ్యవస్థ సరిగ్గా లేనందువల్ల పండించిన కూరగాయలు, సరైన సమయానికి మార్కెట్ కు తరలించకపోవడం వల్ల, నష్టపోతున్నామని రైతులు తెలిపారు, గ్రామస్తుల సమస్యలను పరిష్కరించి వెంటనే రోడ్డు వేయాలని వారు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో డి ఈ ఈ వెంకటేశ్వర్లు, వారాల రాజు కుమార్ జేఏసీ కన్వీనర్,బుంగరి సత్తయ్య,చుక్క శంకర్,అందె ప్రవీణ్, రంగనాబోయిన కుమార్, కడారి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

