
జనం న్యూస్ నవంబర్ 19 కుకట్పల్లి బ్రదర్ శ్రీనివాస్ రెడ్డి
టి పి సి సి ఉపాధ్యక్షులు మరియు కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ బండి రమేష్ ఈ రోజు భారతదేశ ప్రథమ మహిళా ప్రధానమంత్రి,ఉక్కు మహిళ,దేశ సేవకై తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నియోజకవర్గం కాంగ్రెస్ బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు మరియు బాలానగర్ డివిజన్ లో శ్రీకాంత్ పటేల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు హాజరై పూల మాల చేసి ఘన నివాళి అర్పించారు ఈ సందర్బంగా బండి రమేష్ మాట్లాడుతు ఇందిరా గాంధీ నవంబర్ 19, 1917 సంవత్సరం భారతదేశంలోని అలహాబాద్ లో జన్మించారు చిన్నతనంలోనే తన తండ్రి జవహర్లాల్ నెహ్రూ సహకారం తో దేశ రాజకీయాల్లోకి ప్రవేశించి తనదైన ముద్ర వేసారు ఆమె బలమైన మరియు దృఢ సంకల్పం కలిగిన నాయకురాలు జాతీయ కాంగ్రెస్ పార్టి తరపున ఆమె న్యాయకత్వంలో దేశ ప్రధాన మంత్రి పదవి లో ఉన్నప్పుడు బ్యాంకుల జాతీయీకరణ, హరిత విప్లవం మరియు బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో ఆమె పోషించిన పాత్ర వంటి ముఖ్యమైన సంఘటనలు, 1984 అక్టోబర్ 31 న ఆమె హత్యకు గురయ్యే వరకు దేశ చరిత్ర అత్యంత ప్రభావ వంతమైన నాయకులలో ఒకరిగా భారతదేశ భవిష్యత్తు ను రూపొందించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. దేశ ప్రజల మనసులో ఇప్పటికి ఎప్పటికి శాశ్వతంగ నిలిచి పోయారని బండి రమేష్ అన్నారు ఈ కార్యక్రమం లో ఎం రామ్ సి చైర్మన్ పుష్పా రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గోపిశెట్టి రాఘవేందర్, తూము ఎల్లారావు, ఎల్లేష్ యాదవ్, సంధ్య, పులి శివ, శివ చౌదరి, సప్పిడి భాస్కర్, కృష్ణ రాజపుత్, సునీల్ యాదవ్, మధు సుధన్ నర్సింహా యాదవ్, ఎండీ చున్ను పాషా, మల్లేష్ యాదవ్, తూము కొండల్, జోజమ్మ, బండి సుధ, రజిత, మాధురి, కర్రేమ్మ, మస్తాన్, మైసయ్య యాదవ్, ఎండీ నయీమ్, తూము సచిన్, తోట రాజు,హరీష్ రాయపాటి, సప్పిడి వినీత్, హరి ప్రసాద్, భరత్, శివ గౌడ్, మోహన్ రావు,తదితరులు నాయకులు, పాల్గొన్నారు
