
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ నవంబర్ 24
జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండల్కు చెందిన యువ ప్రతిభావంతుడు అర్జున్ రాథోడ్ సోషల్ మీడియాలో తన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో ఆయన రూపొందిస్తున్న రీల్స్, మోటివేషన్ వీడియోలు, ట్రెండింగ్ కంటెంట్ యువతలో భారీ ఆదరణ పొందుతున్నాయి. క్రమంగా ఫాలోవర్లు పెరుగుతూ ఉండటంతో అర్జున్ రాథోడ్ పేరు ప్రస్తుతం మండలంలోనే కాకుండా, పరిసర ప్రాంతాల్లో కూడా విస్తృతంగా చర్చనీయాంశమైంది.తన కంటెంట్లో గ్రామీణ జీవితం, కళలు, ట్రెడిషనల్ థీమ్స్తో పాటు వినోదాత్మక అంశాలను అందంగా చూపిస్తూ అర్జున్ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటున్నాడు. తన స్వంత కృషితో సోషల్ మీడియాలో ప్రజాదరణ పొందిన యువకుడిగా అర్జున్ రాథోడ్ ప్రస్తుతం స్థానిక యువతకు స్పూర్తిగా నిలుస్తున్నాడు.ఇన్స్టాగ్రామ్లో మరింత మంచి కంటెంట్ అందించి ముందుకు సాగాలని అభిమానులు, స్థానికులు అర్జున్ రాథోడ్కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

