
జనం న్యూస్ 26 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ మరియు విజయనగరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 25 మంది నిందితులకు రూ.10,000 చొప్పున జరిమానా, ఇద్దరు నిందితులకు 5 రోజుల జైలుశిక్ష విధిస్తూ విజయనగరం అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎం.ఎస్.హెచ్.ఆర్. తేజ చక్రవర్తి మరియు విజయనగరం స్పెషల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ (ఎక్సైజ్ కోర్ట్) శ్రీవిద్య నవంబరు 25న తీర్పు వెల్లడించినట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ తెలిపారు.వివరాలు:ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 18 మంది వ్యక్తులు పట్టుబడ్డారు.వీరిని అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎం.ఎస్.హెచ్.ఆర్. తేజ చక్రవర్తి ముందు హాజరుపరచగా, 17 మందికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా మరియు ఒక నిందితుడికి 5 రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పు వచ్చింది.రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి:రూరల్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 9 మంది వ్యక్తులు పట్టుబడ్డారు.వీరిని స్పెషల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ (ఎక్సైజ్ కోర్ట్) శ్రీవిద్య ముందు హాజరుపరచగా, 8 మంది నిందితులకు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా మరియు ఒక నిందితుడికి 5 రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పు వచ్చింది.