
జనం న్యూస్ శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం
మండల కేంద్రంలో ఆంగ్ల భాష ఉపాధ్యాయులు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండల స్థాయి తెలంగాణ ఒలంపియాడ్ పరీక్షలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పదవ తరగతి చదువుతున్న దీవెన మొదటి బహుమతి సాధించింది.ఎడ్యు క్వాస్ట్ సీనియర్ విభాగంలో ఎండి రేష్మ మొదటి బహుమతి సాధించగా జూనియర్ విభాగంలో బి రుస్మిత ప్రథమ బహుమతి సాధించింది. నాలుగు బహుమతులకు గాను మూడు బహుమతులు పాఠశాల విద్యార్థులు సాధించారు.ఈ విద్యార్థులు జిల్లా స్థాయికి అర్హత సాధించారు.ఈ సందర్భంగా పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయులు శేఖర్ బాబుకు, బహుమతులు సాధించిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత శుభాకాంక్షలు తెలియజేశారు….