
జనం న్యూస్ 03 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ
పట్నాయక్ఆల్ ఇండియా రైల్వే లోకో పైలట్ స్టాఫ్ అసోసియేషన్ పిలుపు లో భాగంగా విజయనగరంలో రైల్వే లోకో పైలట్ లు 48 గంటల నిరవధిక దీక్ష నేడు చేపట్టారు. ఈ దీక్షా శిబిరంను సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ రమణ, ఉపాధ్యక్షుడు ఏ. గౌరీ నాయుడు, కోశాధికారి ఏ జగన్మోహన్రావు, ఎస్ఎఫ్ఎ జిల్లా ఉపాధ్యక్షుడు సోమేష్ సందర్శించి మద్దతు తెలిపారు. రైల్వేలో ప్రైవేటీకరణ విధానాలు వెంటనే ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.