
.బిచ్కుంద డిసెంబర్ 3 జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం
బిచ్కుంద మండలం ఫత్లాపూర్ గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగాబుధవారం పత్లాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నాగనాథ్ పటేల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్త మారుతి భార్య మచ్కూరి పద్మిని తన నామినేషన్ దాఖలు చేసినారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాలనుసారం కాంగ్రెస్ అభ్యర్థి మచ్కురి పద్మిని గెలుపు తత్యమని ఈ సందర్భంగా ఏఎంసి మాజీ చైర్మన్ అన్నారు. ముందుగా గ్రామస్తులతోని సమావేశమై అందరూ కలిసికట్టుగా పనిచేసే గ్రామ సర్పంచ్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని కార్యకర్తలను దిశ నిర్దేశం చేసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సిద్ధప్ప పటేల్ కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.

