
జనం న్యూస్ డిసెంబర్ 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
శాయంపేట మండలంలోని సూర్య నాయక్ తండా గ్రామం నుండి తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) సర్పంచ్ అభ్యర్థిగా గూగులోతు హారిక జవహర్లాల్ (తీన్మార్ జై) నామినేషన్ దాఖలు చేశారు.ఈ కార్యక్రమంలో టీఆర్పీ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్, టీఆర్పీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, హనుమకొండ జిల్లా మహిళా అధ్యక్షురాలు బాలినే లక్ష్మి, బాలినే జగన్మోహన్, సత్యనారాయణ పాల్గొని అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం మాట్లాడుతూ రవి పటేల్ తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓడించాలని కోరుతున్నాం.టీఆర్పీ పార్టీ లక్ష్యం పేద ప్రజలకు విద్య, వైద్యం, సత్వర న్యాయం, భూమిలేని నిరుపేదలకు రెండు ఎకరాలు అందించడం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఆర్థిక–సామాజికాభివృద్ధి కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇది బహుజనుల పార్టీ, ప్రజల పార్టీ.టీఆర్పీ ప్రతిపాదించిన అభ్యర్థిని ప్రజలు భారీ మెజారిటీతో గెలిపిస్తే గ్రామ అభివృద్ధి వేగవంతమవుతుంది. నిస్వార్థంగా సేవ చేయడానికి ముందుకొచ్చిన యువ సర్పంచ్ అభ్యర్థి హారికను స్వచ్ఛందంగా గెలిపించండి. ఆమె గ్రామాభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తుంది” అని రవి పటేల్ తెలిపారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా నాయకులు ఇనుగాల ప్రణయ్ రాజ్, జినుకల శ్రీను, సామల చంద్రశేఖర్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు......