
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పాటిల్ వసంత్
జనం న్యూస్ 05డిసెంబర్ (కొత్తగూడెం నియోజకవర్గం)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్ట్ లో డిసెంబర్ 21 వ తారీకున జరిగే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పాటిల్ వసంత్ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కాబట్టి మీ మీద కానీ, మీకు తెలిసిన వాళ్ల మీద కానీ, మీ బంధువుల మీద కాని ఏమైనా కేసులు ఉన్నట్లైతే వాటిని (కాంప్రమైజ్ ) రాజీ చేసుకోవచ్చని అన్నారు. కక్షిదారులు తమ కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవడం వలన సమయం, డబ్బు అదా అవుతుందని అన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారం కొరకై ఈ లోక్ అదాలత్ ను నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున అత్యధిక కేసులను పరిష్కరించడం కొరకు పోలీసు అధికారులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కృషి చేయాలని తెలిపారు.
1.యాక్సిడెంట్ కేసులు
2.సివిల్ కేసులు
3.చీటింగ్ కేసులు
4.చిట్ పన్డ్ కేసులు
5.భూతగాదాలు కు సంబంధించిన కేసులు
6.వివాహ బంధానికి సంబంధించిన కేసులు
7.చిన్నచిన్న దొంగతనం కేసులు
8.ట్రాఫిక్ చాలాన్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు