
బిచ్కుంద డిసెంబర్ 5 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం రాజుల గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా శుక్రవారం పత్లాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజయ్ పటేల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త సాదువార్ జై కుమార్ జై తన నామినేషన్ దాఖలు చేసినారు.ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాలనుసారం కాంగ్రెస్ అభ్యర్థి జై కుమార్ గెలుపు తత్యమని ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజయ్ పటేల్ అన్నారు. ముందుగా గ్రామస్తులతోని సమావేశమై అందరూ కలిసికట్టుగా పనిచేసే గ్రామ సర్పంచ్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని కార్యకర్తలను దిశ నిర్దేశం చేసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.