
( జనం న్యూస్ 11 డిసెంబర్, ప్రతినిధి, భీమారం ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు కాసిపేట రవి)
మంచిర్యాల జిల్లా : భీమారం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఉష్కమల్ల విజయలక్ష్మి పున్నం చంద్ గ్రామంలో ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉష్కమల్ల విజయలక్ష్మి మాట్లాడుతూ . గ్రామ అభివృద్ధి కోసం వచ్చానని ఎటువంటి స్వార్థం లేకుండా సేవ చేస్తామని . గ్రామ పాలన అధికారిగా కాకుండా ప్రజలకు సేవకుడిగా సేవ చేస్తా అని . గ్రామ అభివృద్ధి కోసం ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటానని, గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని . యువకుల అభివృద్ధి కోసం తోడ్పడతానని,ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తానని, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న యువతకు తన వంతు కృషిగా మంచి డిజిటల్ లైబ్రరీ తో పాటు అవకాశాలు వచ్చే విధంగా కృషి చేస్తానని . భీమారం బస్టాండ్లో అవసరం మేరకు మరుగుదొడ్డి సౌకర్యం కల్పిస్తామని , రోడ్డు రవాణా సౌకర్యం పటిష్టం చేస్తామన్నారు, భీమారం గ్రామానికి సరిపడా మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఉచిత నీరు అందిస్తామని . తనను ఒక్కసారి దీవించి తమ ఉంగరం గుర్తుకే ఓటు వేయాలని ప్రచారంలో పాల్గొన్నారు.
