
జనంన్యూస్. 12.సిరికొండ.నిజామాబాదు జిల్లా
లొని బోధన డివిజన్ లో సత్తా చాటిన బీసీ బిడ్డలు"నిజాంబాద్ డివిజన్ బీసీ బిడ్డలు అందరూ ఏకమై బిసి అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ పిలుపునిచ్చారు.బీసీ జేఏసీ సిరికొండ అధ్యక్షులు బండారి నరేష్ సిరికొండ మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తోపాటు రాష్ట్ర యువజన కార్యదర్శి కొయ్యాడ శంకర్ పాల్గొన్నారు."ఇదే ఐకమత్యం కొనసాగితే భవిష్యత్తులో బీసీలు అదే రాజ్యాధికారం"జనాభాలో దాదాపు 60 శాతం ఉన్న మనకు 42 శాతం రిజర్వేషన్లు రాబోతుండగా అడ్డుకున్న కొందరు అగ్రవర్ణాల దుర్హంకారులకు బుద్ధి చెప్పాలంటే బీసీ కులస్తులందరూ కూడా ఏకమై కులాలకు అతీతంగా గెలిచే బీసీ అభ్యర్థులకు ఈ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసి సర్పంచులుగా బీసీ అభ్యర్థులను గెలిపించాలని నరాల సుధాకర్ అన్నారు. మనమందరము ఏకమైతే దాదాపు 70% పంచాయతీలను వశం చేసుకోవచ్చని అన్నారు. అది నిన్న బోధన్ డివిజన్ ఎన్నికలతో నిరూపితమైందని అన్నారు. దాదాపు 60 శాతం గ్రామపంచాయతీలను బీసీలు కైవసం చేసుకోవడం శుభసూచకం అన్నారు.మనం సింహభాగం పంచాయతీలను గెలుచుకుంటే అప్పుడు బీసీ ద్రోహులకు గుణపాఠం చెప్పిన వాళ్లమవుతామని అన్నారు. మనం ఎక్కువ గ్రామపంచాయతీలు గెలుచుకుంటే అప్పుడు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కళ్ళు తెరుచుకొని మనకు న్యాయంగా రావాల్సిన రిజర్వేషన్లు దామాషా ప్రకారం ఇస్తాయని అన్నారు. భవిష్యత్తులో మనకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు దక్కాలంటే ఈ పంచాయతీ ఎన్నికల్లో మన ప్రభావం చూపాలి కాబట్టి సెంటిమెంట్లకు, ఆర్థిక బలానికి, ఎమోషన్స్ మనోభావాలకు, ప్రలోభాలకు లొంగకుండా మన బీసీ జాతి కొరకు ఏకం కావాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు సిరికొండల బీసీ జేఏసీ అధ్యక్షుడు బండారి నరేష్ సిరికొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ విలేకరుల సమావేశంలో నరాల సుధాకర్ కొయ్యాడ శంకర్, బండారి నరేష్, చింతకుంట రామస్వామి, బాలాజి, తదితరులు పాల్గొన్నారు