జనం వార్తలు జనవరి 10
రిపోర్టర్ : ఎం రమేష్బాబు. గోదావరిఖని కోల్ బెల్ట్ ప్రాంతంరామగుండం ఏరియా -1ఈ రోజున చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ డా.బి. ప్రభాకర్ , ఐ.ఎఫ్.ఎస్, సి.సి.ఎఫ్ కాళేశ్వరం సర్కిల్ మరియు శ్రీ సి.హెచ్.శివయ్య పెద్దపల్లి జిల్లా ఫారెస్ట్ అధికారి రామగుండం ఏరియా-1 మేడిపల్లి ఉపరితల గని సందర్శనార్థం బంగ్లాస్ ఏరియాకు విచ్చేయటం జరిగింది. వారిని ఆర్జీ-1 జియం శ్రీ లలిత్ కుమార్పు ష్పగుచ్చెం అందించి శాలువాతో సత్కరించి వారికి స్వాగతం పలికారు.(Compensatory Afforestation land) పరిహార అటవీ భూమి భాగంగా సుమారు 650 హెక్టార్ల విస్తీర్ణంలో గల మేడిపల్లి ఉపరితల గనికి సంబందించిన మ్యాపులను పరిశీలించారు. తదనంతరం మేడిపల్లి ఉపరితల గనిని సందర్శించి మేడిపల్లి వ్యూ పాయింట్ వద్ద నుండి క్వారీ ఓవర్ బర్డెన్ డంపులపైన పెంచిన అటవీ ఏరియాను పరిశీలించారు. కొత్తగూడెంలో వి.కే ఓసిపి ప్రాజెక్ట్ కోసం మేడిపల్లి ఉపరితల గని వద్ద ప్రతిపాదించిన "ఫారెస్ట్ ల్యాండ్" లను పరిశీలించారు. మేడిపల్లి ఉపరితల గని పరిసరాలలో ఆటవిని విస్తారంగా ఏవిధంగా అభివృద్ధి చేయాలో చర్చించారు. ఈ కార్యక్రమంలో యస్.ఓటు జిఎం గోపాల్ సింగ్, ఎస్టేట్ డిజీ.ఎం కుమార స్వామీ, ఏరియా ఎన్విరాన్ మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్, ఫారెస్ట్ అధికారి కర్ణ, ఎస్టేట్ మేనేజర్ సాంబ శివ రావు, మేనేజర్ మల్లిఖార్జున్ యాదవ్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు