
జనం న్యూస్ డిసెంబర్ 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
శాయంపేట మండలంలోని మాందారిపేట గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు దారంగుల పాణి విద్యుత్ షాక్కు గురై ఆసుపత్రిలో చికిత్స పొంది, ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్వయంగా బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిని వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ ఘటనపై సంబంధిత విద్యుత్ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు అనంతరం ఎమ్మెల్యే ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించి ఇళ్లపై నుండి ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్ ను చూసి స్పందించిన ఎమ్మెల్యే విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి సమస్యను త్వరితగతిన పరిష్కారం చేయాలని ఆదేశించారు…