
జనం న్యూస్ 19 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
కెనరా బ్యాంకులో దుండగులు దొపిడీకి ప్రయత్నించగా బ్యాంకు మేనేజర్ చాకచక్యంగా వ్యవహరించడంతో వారు పరారయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లిలోని రింగ్రీడ్లో కెనరా బ్యాంకు వద్దకు మధ్యాహ్నం సమయంలో రెండు వాహనాల్లో ఏడుగురు వ్యక్తులు వచ్చారు. వీరిలో ఐదుగురు లోపలికి ప్రవేశించారు. మహిళా మేనేజర్కి గన్ చూపించి బెదిరించారు. వెంటనే అప్రమత్తమైన మేనేజర్ అలారం నొక్కడంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అదనపు ఎస్పీ మోహన్ రావు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దుండగులు పట్టపగలే బ్యాంకులోకి ప్రవేశించి దోపిడీకి యత్నించడంతో ఖాతాదారులు, బ్యాంకు సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.