
జనం న్యూస్ 20 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
గ్రామాలలో నూతనంగా గెలిచిన సర్పంచ్ లు,వార్డు సభ్యులు ప్రజా సమస్యలు పరిష్కరించి ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్. శ్రీరాం నాయక్ సర్పంచ్ లు వార్డు సభ్యులకు సూచించారు. శుక్రవారం అలంపూర్ చౌరస్తాలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన గ్రామాల సీపీఎం ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసి ప్రజల విశ్వాసాన్ని చురగొనాలని సూచించారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాలకు విడుదల చేయాల్సిన నిధుల విషయంలో రాజి లేని పోరాటాలు నిర్వహించి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అట్టడుగు పేదలను గుర్తించి అందరికీ సమన్యాయం జరిగే విధంగా చూడాలన్నారు.ఎంతో విశ్వాసంతో ఓట్లు వేసిన ప్రజల నమ్మకాన్ని వొమ్ము చేయకుండా ప్రజల హక్కులను కాపాడడంలో రాజీ లేని ఉద్యమాలు చేయాలని సూచించారు.గెలిచిన ఓడిన ప్రజల మధ్య ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాల అభివృద్ధి కోసం పోరాడాలని సూచించారు. భూస్వామ్య భావజాలం, ఆధిపత్య దొరణులతో ప్రజల మధ్య విద్వేష కులం, మతం ప్రాంతం పేర ఎన్ని అడ్డంకులు సృష్టించిన,ప్రజలను సంఘటితం చేసి స్వేచ్ఛయుత ప్రజాస్వామ్యనికి పునాదులు వేసిన చరిత్ర సీపీఎందే అని అన్నారు. ఏకగ్రీవాల పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఆపసహ్యం చేస్తున్న తరుణంలో సీపీఎం పోటీలో ఉండటమే కాకుండా, పోటీకి సిద్ధంగా ఉండే వారికి సైతం మద్దతుగా నిలిచామని అన్నారు.స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రధాన బూర్జవా పార్టీలు విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణి చేసినా ప్రజలు సీపీఎం చేస్తున్న పోరాటాలను చూసి ఆదరించారని అన్నారు. జిల్లాలో అధికంగా ఎన్నికైన సర్పంచ్ లు వార్డు సభ్యులలో అధికంగా యువత ఉండటం మంచి పరిణామమని, ప్రజా సమస్యలపై అంకిత భావంతో పనిచేసి ప్రజా అభిమానం చూరగొనాలని సూచించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి,మాట్లాడుతూ…జిల్లాలో అలంపూర్, ఉండవల్లి, గట్టు మూడు మండలాల పరిధిలో లింగనవాయి,క్యాతూరు, ప్రాగటూరు, గొర్లఖాన్ దొడ్డి గ్రామాలలో 15 వార్డులకు పార్టీ బలపరిచిన అభ్యర్థులు పోటీ చేయగా 6 వార్డులలో గెలుపొందారని, ప్రాగటూర్ లో ఉప సర్పంచ్ పదవి సిపిఎం అభ్యర్థికి దక్కిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు రేపల్లె దేవదాసు, పరంజ్యోతి,జి. రాజు, మద్దిలేటి,ఈదన్న, వివి. నరసింహ, నర్మద మండల నాయకులు వెంకటేశ్వర్లు, వెంకటస్వామి, మధు , ఉసేన్,చెన్నరాయుడు, న్యాయవాదులు లక్ష్మన్న,మధు సుధన్ తదితరులు హాజరయ్యారు. ధన్యవాదాలతో మద్దిలేటి సి పి యం జిల్లా కమిటీ సభ్యులు జోగులాంబ గద్వాల జిల్లా