
జనం న్యూస్ 24 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు జిల్లా కేంద్రంలో రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో చేనేత మరియు జౌళి శాఖ ఏర్పాటుచేసిన చేనేత వస్త్రాలను తిలకించడం జరిగింది, అదేవిధంగా స్వయం సహాయక బృందాలచే ఏర్పాటుచేసిన ప్రదర్శనను, అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఏర్పాటుచేసిన ప్రదర్శనను, మానవాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తహీనతకు మరియు మహిళలు & పిల్లలు ఎదుర్కొంటున్న అనారోగ్యాల దృష్ట్యా ఏర్పాటు చేసిన డ్రైఫ్రూట్స్ స్టాల్ ను సందర్శించడం జరిగింది. పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చార్ట్ ను చూడడం జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రదర్శనను వీక్షించడం జరిగింది.