
జనం న్యూస్ 02 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
కొత్త ఉత్సాహం, ఆశయాల మధ్య విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయం నూతన సంవత్సర వేడుకలకు వేదికైంది. గురువారం ఉదయం నుండే కార్యాలయ ప్రాంగణం ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అభిమానుల కోలాహలంతో కిక్కిరిసిపోయింది. ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), అల్లుడు నెల్లిమర్ల నియోజకవర్గం వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు ప్రదీప్ నాయుడు, కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా ప్రారంభించారు.ఈ వేడుకలో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మిఠాయిలు పంపిణీ చేశారు. జిల్లా నలుమూలల నుండి వేల సంఖ్యలో ప్రజాప్రతినిధులు, అభిమానులు తరలివచ్చి మజ్జి శ్రీనివాసరావు, ప్రదీప్ నాయుడు, సిరమ్మకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సంబరాల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ మంత్రి, సాలూరు మాజీ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, విజయనగరం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రావణి, కౌశిక్, నగర కార్పొరేటర్లు, వివిధ మండలాల నుండి వచ్చిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు మరియు వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.కార్యాలయ ఆవరణ అంతా పండుగ వాతావరణం నెలకొనగా, వచ్చిన వారందరికీ మజ్జి శ్రీనివాసరావు, ప్రదీప్ నాయుడు, సిరమ్మ స్వయంగా అభివాదం చేస్తూ నూతన సంవత్సర ఆకాంక్షలు తెలియజేశారు.