
రూ.10.04 లక్షల ఆదాయం – శివరాత్రి, జాతర ఉత్సవాలకు వినియోగం
జనం న్యూస్ జనవరి 07 సంగారెడ్డి జిల్లా,
జిహెచ్ఎంసి పరిధిలోని బీరంగూడ గుట్టపై వెలసిన ప్రసిద్ధ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో 118 రోజుల హుండీ లెక్కింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని పరిశీలకులు ఈఓ శ్రీనివాస్ సమక్షంలో ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, ఆలయ ఈవో శశిధర్ గుప్త ఆధ్వర్యంలో చేపట్టారు. లెక్కింపు కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సహకరించారు.హుండీ లెక్కింపులో మొత్తం రూ.10,04,280 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో శశిధర్ గుప్త తెలిపారు. ఈ మొత్తాన్ని ఆలయ ఖాతాలో జమ చేసి, రాబోయే మహాశివరాత్రి ఉత్సవాలు మరియు జాతర మహోత్సవాల నిర్వహణకు వినియోగించనున్నట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ, భక్తుల సహకారంతో పూర్తి పారదర్శకతతో హుండీ లెక్కింపు నిర్వహించినట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిధులను వినియోగిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ మల్లికార్జున రెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు దండు రమేష్, చంద్రశేఖర్, లక్ష్మీకాంత్ రావు, దీపక్ గౌడ్, శ్రీనివాస్ జె, ఎల్లయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.