
జనం న్యూస్ 08 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
నగరంలోని రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్వహిస్తున్న ఉత్తరాంధ్ర ఫుట్ బాల్ టోర్నమెంట్ బుధవారంతో ముగిసింది. చిట్టివైష్ణవ ట్రస్ట్ ఆధ్వర్యంలో, చిట్టి రమణరావు ప్రోత్సాహంతో, మాజీ క్రీడాకారుడు బుర్లి రామారావు స్మారకార్థం నిర్వహించిన ఈ పోటీల ఫైనల్ మ్యాచ్ కు ముఖ్య అతిథిగా చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ హాజరయ్యారు.బూర్లి రవీంద్ర ఆహ్వానం మేరకు ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు.క్రీడలతోనే మానసిక ఉల్లాసం:ఈ సందర్భంగా సిరమ్మ మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి తోడ్పడతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఫుట్ బాల్ క్రీడ వల్ల దేహదారుఢ్యం పెరుగుతుందని, అంతర్జాతీయ స్థాయిలో ఈ ఆటకు భారతదేశానికి మంచి గుర్తింపు ఉందన్నారు. భవిష్యత్తులో మరింత మంది ప్రతిభావంతులైన క్రీడాకారులు పుట్టుకురావాలని, ఫుట్ బాల్ క్రీడను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆమె పిలుపునిచ్చారు.విజేతల ప్రకటన హుమతుల ప్రదానం:ముగింపు వేడుకల్లో భాగంగా ఫైనల్ మ్యాచ్లో విన్నర్ గా ఎస్.కె.ఎం.ఎల్, రన్నర్ గా శబరి టీమ్ లకు సిరమ్మ బహుమతులు అందజేశారు. క్రీడాకారులు ప్రదర్శించిన నైపుణ్యాన్ని ఆమె అభినందించారు.
పాల్గొన్న ముఖ్యులు:ఈ కార్యక్రమంలో డి. ఎఫ్. ఎ. ప్రెసిడెంట్ డి. వి. రజినీ కుమార్, జి. సన్యాసయ్య, బూర్లి రవీంద్ర, చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోట వాసు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు ఫుట్ బాల్ క్రీడాకారులు పాల్గొన్నారు.