
జనం న్యూస్ జనవరి 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం పేద ప్రజల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…పేద ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అర్హులైన 57 మంది లబ్ధిదారులకు రూ.57,06,612 విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు అనంతరం వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 32 మందికి రూ.10,50,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ పథకాల ద్వారా పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, సామాజిక సమానత్వం సాధించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నియోజకవర్గంలో అమలు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పాణి చంద్ర శాయంపేట గ్రామ సర్పంచ్ చింతల ఉమా మండల అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి మాజీ ఎంపీపీ బసాని చంద్ర ప్రకాష్ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మారెపల్లి (బుజ్జన్న)రవీందర్ వివిధ గ్రామాల సర్పంచ్లు వార్డు మెంబర్ లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…..