
జనం న్యూస్ 19 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
నకిలీ సర్టిఫికెట్లు తయారీ లో కిలక పాత్ర, ఉద్యోగంలో చేర్చుకున్న డి జె టిల్లు టిల్లుతోపాటు, వైద్య ఆరోగ్యశాఖలోని మరొకరి పాత్ర జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆఫీసులో ఇంటి దొంగలు ఇద్దరు. ఈ పాపంలో నాకు సంబంధం లేదని తప్పించుకు తిరుగుతున్న వైనం అప్పటి వైద్యాధికారి శ్రీనివాసులును బురిడీ కొట్టించిన ఇద్దరు ప్రబుద్ధులు విషయం తెలిసి ఆర్టీఏ ద్వారా సమాచారాన్ని కోరిన మెట్రో ఈవినింగ్
సర్టిఫికెట్లు ఇవ్వడానికి వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతుందని దాటవేసిన వైనం డి ఎం హెచ్ ఓ
ఆఫీస్ మొత్తం ఒంటి చేత్తోనే మెయింటెనెన్స్ చేసిన అవినీతి అక్రమాలకు బాట వేసిన డీజె టిల్లు
5 ఏళ్ళు పై గా అంటిల్ ఫర్దర్ ఆర్డర్ పై డిప్యూటేషన్ పై వచ్చి డీజే టిల్లు మధు కరుడు దినకరుడు, ఆశుభకరుడు చోరసితుడు అభవహరుడు, గుణహీనుడే వరూ… ఇవి అన్ని కలగలుపుతే వనపర్తి
జిల్లా వైద్యాధికారి ఆఫీసులో గత ఐదు సంవత్సరాలుగా డిప్యూటేషన్ పై ఆంటిల్ ఫర్దర్ ఆర్డర్ పై తిష్ట వేసి తన కను సన్నల్లో అధికారులను బురిడీ కొట్టించి,నమ్మించి, వంచించి మోసం చేసి తన పబ్బం గడుపుకొని వేలకు వేలు దండుకుని, నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి అక్రమంగా చంద్రశేఖర్, సిరిషలకు ఉద్యోగాలు కట్ట పెట్టడంలో కీలక భూమిక పోషించిన డీజే టిల్లు వైనంజిల్లా వైద్య ఆరోగ్యశాఖలో సంచలనం సృష్టించింది. గత జులై నెలలో తీగ లాగితే 6 నెలల తర్వాత డొంక కదిలింది. విషయం తెలిసి ఆర్టిఏ ద్వారా సమాచారాన్ని సేకరించటకు ప్రయత్నించగా సర్టిఫికెట్స్ జిరాక్స్ ఇవ్వవలసిందిగా అభ్యర్థించగా వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందని తనసలె శుద్ధ పూసనంటూ,ఎలాంటి సర్టిఫికెట్లను తమరికి ఇవ్వలేమంటూ, బుకాయింపు చేశారు. పతివ్రత పాయసం వండితే తెల్లారేసరికి చల్లారి లేదంట. అనే విధంగా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో గత ఐదేళ్లుగా డిప్టేషన్ తిష్ట వేసిన డీజే టిల్లు అప్పటి వైద్యాధికారి శ్రీనివాసులు ను బురిడీ కొట్టించి తమదైన శైలిలో అక్రమంగా అన్ని తెలిసి నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇప్పించడంలో డి జె టిల్లు తో పాటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోమరొక వ్యక్తి ఉన్నారు. తులసి వనంలో గంజాయి మొక్కల దాపురించి అందిన కాడికి దండుకొని, చంద్రశేఖర్ శిరీషలను నట్టేట ముంచారు. ఒకానొక సందర్భంలో వైద్య ఆరోగ్యశాఖలో వైద్యాధికారిని కలవాలన్న తన అనుమతి లేకుండా ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతనే వైద్యాధికారిని కలవాల్సిందిగా హు కుమ్ జారీ చేసిన వైనం చోటుచేసుకుంది. ఇదే వైద్య ఆరోగ్యశాఖలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న చంద్రశేఖర్ ను నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని తనకు తెలిసిన దగ్గర నకిలీ సర్టిఫికెట్లు తయారు చేయించి అక్రమంగా వైద్య ఆరోగ్యశాఖలో నియామక పత్రాన్ని అందజేశారు. ఇది ఏమీ తెలియని అప్పటి వైద్యాధికారి శ్రీనివాసులు నమ్మిన వ్యక్తులే నట్టేట ముంచుతున్నాడని తెలియక నియామక పత్రాన్ని అందజేతలో తన భూమిక పోషించారు. ఇదే కోవలో శిరీష నిలిచారు. డీజే టిల్లు పై అనేక అవినీతి ఆరోపణలు అప్పట్లో వచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సంచలనంగా మారింది. టి ల్లు మాటే అధికారులకు వేదం. ఇతని ఏమైనా చెబితే అధికారులు సైతం ఐసు ముద్దలా కరిగిపోవాల్సిందే. మెట్రో ఈవినింగ్ ఆర్టిఏ ద్వారా ఎంపికైన అభ్యర్థుల వివరాలు ఏ ఏ పోస్టింగ్ లో ఉన్నారు అడగగ, అభ్యర్థులు ఎక్కడ ఏ పోస్టింగ్ లో ఉన్నారు వివరాలు కావాలి అని అడగగా, మూడో పక్ష వ్యక్తిగత సేవా వివరాలు ప్రకారం వ్యక్తిగత సమాచారం ప్రజా ప్రయోజనానికి సంబంధించినప్పుడు వెల్లడించడం కుదరదు. ఇలాంటివి. మూడు ప్రశ్నలు వారిని కొరగా వెల్లడించడం కుదరదని బుకాయంపు తో దాటవేశారు. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో చేరి 11 నెలలుగా జీతాలు తీసుకొని ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన చంద్రశేఖర్ శిరీషలపై జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ చేయడం హర్షించదగ్గ విషయమైనప్పటికీ. వైద్య ఆరోగ్యశాఖలో టిల్లు లీలతో అవినీతిమయమైన జిల్లా వైద్యాధికారి ఆఫీసు, ఆ మరకలను తుడిచివేసుకొనుటకు కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైద్యాధికారి సాయినాథ్ రెడ్డి కి తలకు మించిన భారమైంది. ఇంకా నకిలీ సర్టిఫికెట్లతో మరికొందరు వైద్య ఆరోగ్యశాఖలో తిష్ట వేసినట్లు విశ్వసనీయ సమాచారం. కొత్తగా వచ్చిన జిల్లా వైద్యాధికారి సాయినాథ్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేయించి వాటి ద్వారా ఉద్యోగాన్ని కట్టబెట్టిన సీనియర్ అసిస్టెంట్ జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేయడం అర్శించదగ్గ విషయమైనప్పటికీ, వైద్య ఆరోగ్యశాఖలో ప్రధాన భూమిక పోషించిన మరో ఇంటి దొంగను వదిలిపెట్టడవెనుక మర్మం ఏంటో అర్థం కావడం లేదు .