
జనం న్యూస్ జనవరి 20 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి, సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త పంథాల్లో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, కోరారు. ఈ మధ్య కాలంలో చోటుచేసుకున్న వివిధ సైబర్ మోసాలను ఉదహరిస్తూ, ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలను ఆయన వివరించారు. ఇటీవల జరుగుతున్న ప్రధాన సైబర్ మోసాలు:డిజిటల్ అరెస్ట్ (సీబీఐ, ఈడీ లేదా పోలీస్ అధికారులమని ఫోన్ చేసి, మీ పేరు మీద అక్రమ పార్శిల్ వచ్చిందని భయపెట్టి గంటల తరబడి వీడియో కాల్ ద్వారా నిర్బంధించి డబ్బులు వసూలు చేయడం.పెట్టుబడి మోసాలు వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి లక్షలాది రూపాయలు దోచుకోవడం.లోన్ యాప్స్ తక్షణమే రుణాలు ఇస్తామని చెప్పి, ఫోన్ డేటాను తస్కరించి, వేధింపులకు గురిచేయడం.కేవైసీ అప్డేట్ & లింక్స్: బ్యాంకు ఖాతా నిలిచిపోతుందని భయపెట్టి, అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయించి అకౌంట్లు ఖాళీ చేయడం.ప్రజలకు సూచనలు:ప్రభుత్వ సంస్థలు లేదా బ్యాంకులు ఎప్పుడూ వీడియో కాల్స్ చేసి మిమ్మల్ని డబ్బులు అడగవు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింక్లను క్లిక్ చేయకండి. తుహిన్ సిన్హా, ఓటీపీ షేర్ చేయవద్దు:* మీ బ్యాంక్ వివరాలు కానీ, ఓటీపీలు కానీ ఎవరికీ చెప్పకండి.ఆశకు లోనుకాకండి: సోషల్ మీడియాలో వచ్చే అనవసరపు ప్రకటనలు, పార్ట్-టైమ్ ఉద్యోగాల ఆఫర్లను నమ్మకండి.అపరిచిత కాల్స్ పట్ల జాగ్రత్త: వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు ముఖం చూపించకుండా బ్లాక్ మెయిల్ చేసే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండండి.బాధితులు ఏం చేయాలి?ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి గంట గోల్డెన్ హవర్ లోనే స్పందించాలి: వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయండి.www.cybercrime.gov.in పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయండి.స్థానిక పోలీస్ స్టేషన్ను సంప్రదించండి.ప్రజలందరూ సైబర్ భద్రతా నియమాలను పాటిస్తూ, సైబర్ నేర రహిత జిల్లాగా అనకాపల్లిని తీర్చిదిద్దడంలో సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.//